భారీ ఆధిక్యంతో దూసుకెళ్తున్న త్రిపుర మాజీ సీఎం.. | BJP's Biplab Kumar Deb Leading In Tripura | Sakshi
Sakshi News home page

భారీ ఆధిక్యంతో దూసుకెళ్తున్న త్రిపుర మాజీ సీఎం..

Jun 4 2024 12:58 PM | Updated on Jun 4 2024 1:14 PM

BJP's Biplab Kumar Deb Leading In Tripura

ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతోంది. ఇప్పటికే పలు నియోజక వర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ముందంజలో ఉన్నారు. దిగ్గజ నేతలైన మోదీ, రాహుల్ గాంధీ వారి వారి నియోజక వర్గాల్లో దూసుకెళ్తున్నారు. త్రిపురలోని రెండు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది .

2018 నుంచి 2022 వరకు త్రిపుర ముఖ్యమంత్రిగా పని చేసిన బిప్లబ్ కుమార్ దేబ్.. త్రిపుర పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా నిలిచారు. ఈయన ఇప్పటికే తన సమీప ప్రత్యర్థి ఆశిష్ కుమార్ సాహా కంటే.. 5,70,071 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

అదే సమయంలో త్రిపుర తూర్పు లోక్‌సభ స్థానంలో, బీజేపీ అభ్యర్థి కృతి దేవి డెబ్బర్‌మన్ తన సమీప ప్రత్యర్థి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ(ఎం)) రాజేంద్ర రియాంగ్‌పై 2,92,164 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement