చ‌రిత్రలో ఆగస్టు5 నిలిచిపోతుంది : బాబా రాందేవ్ | Baba Ramdev Says August 5 A Historic Day | Sakshi
Sakshi News home page

రాముడు, హ‌నుమంతుడికి మోదీ అప‌ర భ‌క్తుడు

Aug 5 2020 1:48 PM | Updated on Aug 5 2020 2:37 PM

Baba Ramdev Says August 5 A  Historic Day - Sakshi

అయోధ్య :  రామాల‌యానికి భూమి పూజ జ‌రిగిన ఆగ‌స్టు 5 ను చారిత్ర‌క‌రోజుగా యోగా గురువు బాబా రాందేవ్ అభివ‌ర్ణించారు. త‌ర‌త‌రాలు ఈ రోజును  గ‌ర్వంగా గుర్తుంచుకుంటాయ‌ని అన్నారు. భార‌త్‌లో కొత్త చ‌రిత్ర లిఖించ‌బ‌డింద‌ని, ప్ర‌జ‌లంద‌రూ ఈరోజును ప‌ర‌స్క‌రించుకొని సంబ‌రాలు జ‌రుపుకోవాల‌న్నారు. అయోధ్య‌లో రామ‌మందిర శంకుస్థాప‌న సంద‌ర్భంగా బాబా రాందేవ్ ప్ర‌త్యేక అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..ఆల‌య నిర్మాణంతో దేశంలో రాజ‌రాజ్యానికి నాంది ప‌లికిన‌ట్ల‌య్యింద‌న్నారు. ఈ చారిత్ర‌క ఘ‌ట్టంతో సాంస్కృతిక, ఆర్థిక అస‌మాన‌త‌లు తొలిగిపోతాయ‌ని రామ‌రాజ్యంలో ప్ర‌జ‌లంద‌రూ సంతోషంగా ఉంటార‌న్నారు. రామ రాజ్యం అంటే ఆదర్శవంతమైన పరిపాలన అని రాందేవ్ అన్నారు. (లైవ్‌ అప్‌డేట్స్‌; అయోధ్యలో భూమిపూజ)

రాముడికి, హ‌నుమంతుడికి న‌రేంద్ర‌మోదీ అప‌ర భ‌క్తుడ‌ని, అలాంటి ప్ర‌ధాని మ‌న‌కుండ‌టం ప్ర‌జ‌లందరి అదృష్ట‌మ‌ని అన్నారు.    హిందూ ధ‌ర్మం గ‌ర్వించేలా చేసిన ప్ర‌ధాని మోదీనే అని బాబా రాందేవ్ కొనియాడారు. అత్యంత భ‌ద్ర‌త , కోవిడ్ ప‌రిస్థితుల నేప‌థ్యంలో కేవ‌లం 175 మంది అతిథుల‌ను మాత్ర‌మే ఆహ్వానించారు. అయెధ్య ర‌హ‌దారుల‌కు ఇరువైపులా రామ మందిర న‌మూనా చిత్రాలతో స‌ర్వాంగ సుంద‌రంగా అలంక‌రించారు. అయోధ్య న‌గ‌ర‌మంతా రామ‌నామంతో మార్మోమోగిపోతుంది. (‘భూమి పూజ రాజకీయ కార్యక్రమం కాదు’)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement