పెళ్లి చేసుకున్న రెండు రోజులకే ఆదరా బాదరాగా..! | Ahmedabad Plane Incident: Two Days After Marriage Ready To London | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకున్న రెండు రోజులకే ఆదరా బాదరాగా..!

Jun 13 2025 9:28 PM | Updated on Jun 13 2025 9:32 PM

Ahmedabad Plane Incident: Two Days After Marriage Ready To London

వడోదరా:  అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చిపోయింది. పలు కుటుంబాల్లో దీనగాథను నింపేసింది. 241 కుటుంబాల్ని చిన్నాభిన్నం చేసేసింది. ఈ ప్రమాదం అనంతరం తడిమే కొద్దీ వర్ణణాతీతమైన గాథలే కనిపిస్తున్నాయి. తాజాగా పెళ్లైన రెండు రోజులకే లండన్‌లో ఉద్యోగం కోసం విమానం ఎక్కిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో అది ఆ కుటుంబంలో తీవ్ర శోకాన్ని మిగిల్చింది. 

వడోదరాకు చెందిన భావిక్‌ మహేశ్వరి(26).. రెండు రోజుల క్రితం చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి నిమిత్తం రెండు వారాల క్రితం లండన్‌ నుంచి భారత్‌కు వచ్చిన భావిక్‌.. జూన్‌ 10వ తేదీన పెళ్లి చేసుకున్నాడు. అనంతరం లండన్‌లో పని చేస్తున్న భావిక్‌,.. జూన్‌ 12వ తేదీన అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా ఫ్లైట్‌ ఎక్కాడు. 

అంతే అదే అతని ఆఖరి మజిలీ అయ్యింది.  తండ్రితో మాట్లాడిన మాటలే ఆఖరి మాటలు అయ్యాయి.  ఈ విషయాన్ని పదే పదే తలుచుకుని తండ్రి అర్జున్‌ మహేశ్వరి కన్నీటి పర్యంతమవుతున్నారు. ‘ నా తనయుడు మళ్లీ వస్తానన్నాడు.. లండన్‌ వెళ్లాక ఫోన్‌ చేస్తానన్నాడు. టేకాఫ్‌ టైం అవుతుంది నాన్న అన్నాడు’అని చివరిసారి మాట్లాడిన మాటలు తలుచుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. తన కుమారుడు లండన్‌లో చదువుకని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడని, పెళ్లి నిమిత్తం వచ్చి ఇలా మృత్యువాత పడ్డాడని తండ్రి శోకతప్త హృదయంతో మాట్లాడారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement