ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురి దుర్మరణం | 7 dead And 3 injured in truck car accident in Banaskantha Gujarat | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురి దుర్మరణం

Jan 25 2026 10:41 AM | Updated on Jan 25 2026 12:12 PM

7 dead And 3 injured in truck car accident in Banaskantha Gujarat

పలన్‌పూర్‌: గుజరాత్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రక్కు.. కారుని ఢీకొన్న ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బనాస్కంఠ జిల్లాలోని ఇక్‌బాల్‌గాథ్‌లోని హైవేపై ఈ ప్రమాదం జరిగింది. 

రాంగ్‌ రూట్‌లో వస్తున్న ట్రక్కు.. ఎదురుగా వస్తున్న ఇన్నావో కారును ఢీకొట్టింది. ఆ సమయంలో డ్రైవర్‌తో కలిపి 10 మంది ఇన్నోవా కారులో ఉన్నారు. వీరిలో ఏడుగురు మృత్యువాత పడగా, ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement