సమగ్రంగా పరిశీలించాలి
మున్సిపల్ ముసాయిదా ఓటర్ల జాబితా అంతా గందరగోళంగా ఉంది. 10వ వార్డులో మొత్తం 1129 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ మా వార్డుకు సంబంధం లేని పట్టణం చివర ఉన్న పలు వార్డుల ఓటర్ల పేర్లను మా వార్డులో చేర్చారు. అధికారులు సమగ్రంగా పరిశీలించి సరియైన ఓటరు జాబితా తయారు చేసి ఎన్నికలు నిర్వహించాలి.
– హన్మంతు, మాజీ ఎంపీటీసీ, 10వ వార్డు, కోస్గి
అభ్యంతరాలు స్వీకరిస్తున్నాం
ఓటరు జాబితా సవరణపై అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేయాలి. ఈ నెల 9 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తున్నాం. ఇందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశాం. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి తుది జాబితాను విడుదల చేస్తాం.
– నర్సయ్య, మున్సిపల్ కమిషనర్, నారాయణపేట
●


