
రజతోత్సవ సభతో రాజకీయాల్లో పెనుమార్పు
నారాయణపేట: బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు తీసుకువస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో జెండాను ఆయన ఆవిష్కరించారు. కార్యకర్తలు, నాయకులు జై బీఆర్ఎస్.. జైతెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చలో వరంగల్కు నారాయణపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ప్రత్యేక వాహనాలలో గులాబీ దండు కదిలిందన్నారు. 10 లక్షల మందితో జరిగే రజతోత్సవ మహాసభపై యావత్ ప్రపంచం ఇంత పెద్ద ఎత్తున ఎలా చేస్తారని ఎదురుచూస్తున్నరన్నారు. తెలంగాణను కదిలించే ప్రయత్నం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేస్తారని అన్నారు. అనంతరం నియోజకవర్గం నుంచే 30 బస్సులు, 155 వాహనాలలో 3300 మంది వరంగల్ సభకు తరలివెళ్లారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ మాజీ వైస్చైర్మన్లు కన్నాజగదీశ్, చెన్నారెడ్డి, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు వేపూరి రాములు, విజయ్సాగర్, నాయకులు ప్రతాప్రెడ్డి, సుదర్శన్రెడ్డి, సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.