నారాయణపేట: పట్టణంలోని బారంబావి దగ్గర ఉన్న చిల్డ్రన్స్ హోంను సీనియర్ సివిల్ జడ్జి వింద్యానాయక్ సోమవారం సాయంత్రం తనిఖీ చేశారు. హాజరు పట్టిక, వసతులను పరిశీలించడంతోపాటు హోంలో పనిచేస్తున్న స్టాఫ్ మెంబర్స్ డైలీ వస్తున్నారా లేదా అని ఆరా తీశారు. ఆహార ధాన్యాల నాణ్యత, తాగు నీరు, పరిశుభ్రత, సీసీటీవీ పనితీరు, సిబ్బంది మూమెంట్ రిజిస్టర్, ఆఫీస్ ఆర్డర్స్ ప్రకారం అడ్మిషన్ తీసుకుంటున్నారా అనేదానిపై వివరాలు సేకరించారు. 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సొంత వాళ్లలా వారిని చూసుకోవాలని సిబ్బందిని జడ్జి ఆదేశించారు.
భగత్సింగ్ను
ఆదర్శంగా తీసుకోవాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: దేశాన్ని పట్టి పీడిస్తున్న పెట్టుబడిదారి వ్యవస్థకు, మతోన్మాదం, కులతత్వాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యు వతరం, ప్రజలు భగత్సింగ్ స్ఫూర్తితో ఉద్యమించాలని, రాష్ట్ర వ్యాప్తంగా భగత్సింగ్ వర్ధంతి సభలను నిర్వహించాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్, పీవైఎల్ జిల్లా కార్యదర్శి ప్రతాప్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో భగత్సింగ్ 94వ వర్ధంతి వాల్పోస్టర్ను విడుదల చేసి మాట్లాడారు. భారత ఉపఖండంలో భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ బ్రిటీష్ సామ్రాజ్యవాద చేతిలో ఉరి తీయబడి దేశం కోసం తమ ప్రాణాలను సైతం తృణ పాయంగా వదిలేశారన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం కుహానా దేశభక్తిని బట్టబయలు చూస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికాలో నివసిస్తున్న భారత ప్రజలపై అనుసరించే దుశ్చర్యలకు వ్యతిరేకంగా భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 94వ వర్ధంతి సభలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీవైఎల్ ఉపాధ్యక్షుడు సలీం, మారుతి, గౌస్, శ్రీకాంత్, రాము, విష్ణు, గణేశ్, రాహుల్, మహేశ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
అలివేలు మంగ హుండీ లెక్కింపు
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ అలివేలు మంగతాయారు హుండీ లెక్కింపు సోమవారం చేపట్టారు. ఈ ఏడాది అమ్మవారికి హుండీ ద్వారా రూ.9,73,440 ఆదాయం వచ్చింది. లెక్కింపులో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు సుధా, అలివేలు మంగమ్మ, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.
చిల్డ్రన్ హోం తనిఖీ