తేనె ఉత్పత్తితో అదనపు ఆదాయం | - | Sakshi
Sakshi News home page

తేనె ఉత్పత్తితో అదనపు ఆదాయం

Mar 5 2026 7:28 AM | Updated on Mar 5 2026 7:28 AM

ఎమ్మిగనూరు సెంట్రల్‌: తేనె టీగలు పెంచుతూ తేనె ఉత్పత్తి చేయడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ ఎం.జాన్సన్‌, కేవీకే ప్రోగ్రాం కో–ఆర్డినేటర్‌ డా. రాఘవేంద్ర చౌదరి పేర్కొన్నారు. బనవాసి కేవీకేలో గత కొన్ని రోజులుగా తేనేటీగల పెంపకంపై ఇస్తున్న శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. శిక్షణకు హాజరైన 30 మంది రైతులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తేనెటీగల పెంపకం ద్వారా నూనెగింజల పంటలలో పరాగసంపర్కం మెరుగుపడి ఉత్పాదక గణనీయంగా పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు అశోక్‌కుమార్‌, రవిప్రకాష్‌రెడ్డి, సుజాతమ్మ, ట్రైనర్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement