రామగిరి(నల్లగొండ) : ఆధునిక కంప్యూటర్ సైన్స్కు గణితశాస్త్రమే వెన్నెముక అని ఉమెన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాస్రాజు అన్నారు. కళాశాల గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘మ్యాథమెటిక్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్ అండ్ ఆపర్చునిటీస్’ అనే అంశంపై బుధవారం ఒక రోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిస్క్రీట్ స్ట్రక్చర్స్, లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ వంటి భావనలు ప్రతి అల్గారిథమ్, సురక్షిత లావాదేవీల వెనుక ఉన్నాయని, విద్యార్థులు గణితాన్ని డిజిటల్ ప్రపంచాన్ని నడిపించే శక్తివంతమైన సాధనంగా అర్థం చేసుకోవాలని సూచించారు. ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.ఉపేందర్ అండర్ గ్రాడ్యుయేట్ పూర్తయిన తర్వాత గణితశాస్త్రంలో అవకాశాలు అనే అంశంపై మాట్లాడారు. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక రంగాల్లో గణిత విద్యార్థులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని, విద్యార్థులు ఇంటర్ డిసిప్లినరీ అభ్యాసంపై దష్టి సారించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒడేలు వంగ అల్గారిథమ్ డిజైన్లో డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, గ్రాఫ్ థియరీ పాత్ర, క్రిప్టోగ్రఫీ నెట్వర్క్ సెక్యూరిటీలో గణిత పునాదులు, మెషిన్ లెర్నింగ్కు తోడ్పడే లీనియర్ ఆల్జీబ్రా, క్వాంటం కంప్యూటింగ్ అనువర్తనాలపై సుమారు మూడు గంటల పాటు విద్యార్థులకు సవివరంగా వివరించారు. కార్యక్రమంలో కన్వీనర్ టి.శ్రీనివాసులు ఎ.మల్లేశ్వరి, వైస్ ప్రిన్సిపాల్ కె.వెంకటేశ్వర్లు, పి.సంతోషి తదితరులు పాల్గొన్నారు.


