భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలి

Jan 5 2026 11:12 AM | Updated on Jan 5 2026 11:12 AM

భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలి

భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలి

ఊర్కొండ: మండలంలోని ఊర్కొండపేటలో ఈ నెల 17 నుంచి 24వ తేదీ వరకు జరిగే శ్రీపబ్బతి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అన్నిశాఖల అధికారులతో సమన్వయంగా భక్తులకు అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ముఖ్యంగా ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ నారెడ్డి సత్యనారాయణరెడ్డి, ఈఓ సత్యచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement