విఘ్నాలు తొలగించే మహాగణపతి నవరాత్రి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యేకంగా అలంకరించిన మండపాల్లో గణనాథుల విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. వినాయకుడికి ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, భజనలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా గణనాథుడి నామస్మరణతో పండుగ వాతావరణం నెలకొంది.
– ములుగు
ములుగులో విఘ్నేశ్వరుడికి పూజలు చేస్తున్న భక్తులు
ఏటూరునాగారంలో బొడ్రాయి వద్ద వినాయకుడికి పూజలు


