మేడారం జాతరపై పుస్తకం ఆవిష్కరణ
ములుగు రూరల్: మేడారం మహాజాతర సమ్మక్క–సారలమ్మపై కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తకం ప్రచురించారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హైదరాబాద్లో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతరలో అరుదైన చాయాచిత్రాలను సంకలం చేసి పుస్తకంగా రూపొందించిన ప్రముఖ చిత్ర నిర్మాత నర్సింగరావు, ట్రస్ట్ సభ్యులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, బీపీ పాపారావు, రిటైర్డ్ ఎన్ఐటీ ప్రొఫెసర్ పాండురంగారావు, శ్రీధర్, రిటైర్డ్ డీజీపీ రతన్ జె పూలెలను మంత్రి ప్రశంసించారు. సమ్మక్క–సారలమ్మ జాతరను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడానికి అవసరమయ్యే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు.


