సమన్వయంతో పట్టణాభివృద్ధి
ములుగు: పార్టీలకతీతంగా పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు సమన్వయంతో ముందుకు వెళ్తామని ములుగు మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ తెలిపారు. ములుగు మున్సిపాలిటీ నూతన పాలకవర్గం గురువారం బాధ్యతలు స్వీకరించింది. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ కౌన్సిలర్లతో సమన్వయం చేసుకుంటూ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ ఆసియా షాహీన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గొల్లపల్లి రాజేందర్గౌడ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ములుగు మున్సిపల్ చైర్పర్సన్ చంద్రకళ


