హక్కుల పరిరక్షణకు కృషి
భూపాలపల్లి అర్బన్: ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నిరంతరం కృషి చేస్తుందని ఆ సంఘం నాయకులు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలు చర్చించారు. ఈ సమావేశంలో సంఘం కార్యదర్శి సునీల్, అసోసియేట్ అధ్యక్షులు మహమ్మద్ సంధాని, కార్యవర్గ సభ్యులు రాజేందర్, ఇందిర, స్వాతి పాల్గొన్నారు.


