వాహనాల రద్దీ
ఏటూరునాగారం: మేడారం సమ్మక్క–సారలమ్మ పునఃప్రతిష్ఠాపన ప్రారంభోత్సవం, కేబినెట్ సమావేశానికి ఆదివారం సీఎంతో పాటు మంత్రులు మేడారానికి చేరుకోవడంతో ఏ రోడ్డు చూసినా వాహనాల రద్దీ కనిపించింది. అధికారుల వాహనాలతో రోడ్డు కిక్కిరిసిపోయింది. హరిత హోటల్, బస్టాండ్, మేడారం గద్దెల రోడ్ల గుండా వెళ్లేందుకు అధికారులు, రాజకీయ నాయకుల వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చి మిగితా భక్తుల వాహనాలను దారి మళ్లించారు. వన్వే ట్రాఫిక్ ఆంక్షలు పెట్టడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. వాహనాల మళ్లింపుపై పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రైవేట్ వాహనాలను గద్దెల చుట్టు పక్కల ప్రాంతాలకు అనుమతించలేదు.


