జేబు దొంగల హెచ్చరిక
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ జాతరలో జేబు దొంగలున్నారు..జాగ్రత్త చేతివాటం ప్రదర్శించే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. మేడారంలోని నార్లాపూర్ పీఎస్ పోలీసులు గత జాతరలో జేబు దొంగతనాలకు పాల్పడిన వారి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ బ్యానర్ను సోమవారం సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. భక్తులు నగదు, మొబైల్ ఫోన్లు, విలువైన వస్తువులు జాగ్రతగా ఉంచుకోవాలని అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచనలు చేస్తున్నారు.


