పుస్తకావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

పుస్తకావిష్కరణ

Jan 12 2026 7:46 AM | Updated on Jan 12 2026 7:46 AM

పుస్తకావిష్కరణ

పుస్తకావిష్కరణ

ఎస్‌ఎస్‌తాడ్వాయి: సమ్మక్క –దీ గ్లోరీ ఆఫ్‌ మేడారం పుస్తకాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క ఆవిష్కరించారు. సమాచార పౌర సంబంధాలశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కన్నెంటి వెంకటరమణ రచించిన పుస్తకాన్ని మేడారంలో మంత్రి సీతక్క కలెక్టర్‌ దివాకరతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారం జాతర విశిష్టతను ఆదివాసీ సంస్కృతి– సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ పుస్తకాన్ని రూపొందించారని సీతక్క తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, డీపీఆర్వో రఫీక్‌ పాల్గొన్నారు.

చిన్నారి తల్లిదండ్రులకు అప్పగింత

అదే విధంగా మేడారంలో జాతర ఏర్పాట్లను మంత్రి పర్యవేక్షిస్తున్న సమయంలో ఓ చిన్నారి తప్పిపోయిన విషయాన్ని సీతక్క గమనించారు. వెంటనే అధికారులు ఆ చిన్నారి వివరాలు సేకరించి తల్లిదండ్రులను గుర్తించగా వారికి అప్పగించారు. జాతరలో చిన్నపిల్లలను జాగ్రతగా చూసుకోవాలని మంత్రి సీతక్క తల్లిదండ్రులకు సూచించారు. మేడారంలో భక్తులు, పిల్లలు తప్పిపోతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement