స్లాట్‌ బుకింగ్‌పై అవగాహన తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

స్లాట్‌ బుకింగ్‌పై అవగాహన తప్పనిసరి

May 24 2025 1:33 AM | Updated on May 24 2025 1:33 AM

స్లాట్‌ బుకింగ్‌పై అవగాహన తప్పనిసరి

స్లాట్‌ బుకింగ్‌పై అవగాహన తప్పనిసరి

ములుగు: రిజిస్ట్రేషన్‌ శాఖలో చేపట్టే స్లాట్‌ బుకింగ్‌పై ప్రతీ ఒక్క దస్తావేజులేఖరులు అవగాహన తప్పనిసరి కలిగి ఉండాలని జిల్లా రిజిస్ట్రార్‌ ఫణిందర్‌ అన్నారు. ఈ మేరకు దస్తావేజులేఖరులకు శుక్రవారం ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయనకు వారు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఫణిందర్‌ మాట్లాడుతూ జూన్‌ 2వ తేదీ నుంచి స్లాట్‌ బుకింగ్‌ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుందన్నారు. రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రతిరోజూ 48 స్లాట్‌లకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతీస్లాట్‌ 10నిమిషాల్లో ఆన్‌లైన్‌లో పూర్తి చేయబడుతుందన్నారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు సబ్‌ రిజిస్ట్రార్‌ దిలీప్‌చంద్రగోపాల్‌, దస్తావేజులేఖరులు సూర్యదేవర విశ్వనాధ్‌, సాదు రఘు, ప్రవీణ్‌, రామకృష్ణ, భాస్కర్‌, హరినాధ్‌, రాజేశ్‌, సుజాత పాల్గొన్నారు.

జిల్లా రిజిస్ట్రార్‌ ఫణిందర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement