‘వేసవి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి’ | - | Sakshi
Sakshi News home page

‘వేసవి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి’

May 6 2025 12:40 AM | Updated on May 6 2025 12:40 AM

‘వేసవి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి’

‘వేసవి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి’

వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని జవహర్‌నగర్‌ కేజీబీవీలో నిర్వహిస్తున్న వేసవి శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సమగ్ర శిక్ష క్వాలిటీ కోఆర్డినేటర్‌ కాటం మల్లారెడ్డి, జిల్లా సైన్స్‌ అధికారి అప్పని జయదేవ్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం కేజీబీవీలో వేసవి శిబిరాన్ని వారు ప్రారంభించి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా ఆటలు, పాటలతో పాటు స్పోకెన్‌ ఇంగ్లిష్‌, గణిత సమస్యలను వేగంగా సాధించడం, యోగ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. కేజీబీవీ విద్యార్థులే కాకుండా జిల్లాలోని 6 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులు శిబిరంలో పాల్గొనవచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష కో ఆర్డినేటర్‌ గ్యాదరి రమాదేవి, సమ్మర్‌ క్యాంపు కో ఆర్డినేటర్‌ జయ వసంతలక్ష్మి, సహాయ కోఆర్డినేటర్‌ జీవనప్రియ, డీసీఈబీ సహాయ కార్యదర్శి విక్రమ్‌, రిసోర్స్‌పర్సన్లు నరసింహా, రాజశేఖర్‌, నిరంజన్‌రెడ్డి, హరిత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement