
ఓపెన్ టెన్త్ పరీక్షల్లో 19మంది డీబార్
ములుగు రూరల్: ములుగు మండల పరిధిలోని బండారుపల్లి మోడల్ పాఠశాలలో నిర్వహిస్తున్న ఓపెన్ టెన్త్ పరీక్ష కేంద్రంలో 19మంది అభ్యర్థులను బుధవారం డీబార్ చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఓపెన్ పరీక్ష సమయంలో హైదరాబాద్ నుంచి వచ్చిన స్క్వాడ్ బృందం తనిఖీలు చేయగా అభ్యర్థుల వద్ద మాస్కాపీయింగ్ స్లిప్లు దొరకడంతో డీబార్ చేసినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులను మిగిలి ఉన్న మూడు పరీక్షలకు హాజరు కాకుండా డిబార్ చేశారని వివరించారు.
‘భూ క్రమబద్ధీకరణ
ప్రొసీడింగ్లు ఇవ్వాలి’
ములుగు రూరల్: భూ క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్) ప్రొసీడింగ్లు ఇవ్వాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీంద్రచారి బుధవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పి ఇప్పుడు డబ్బులు వసూల్ చేస్తుందని ఆరోపించారు. డబ్బు చెల్లించినా ప్రొసిడింగ్ కాపీలను అందించకుండా కాలయాపన చేయడం సరికాదని వివరించారు. జిల్లాలో 1,440 మంది ఎల్ఆర్ఎస్ ఫీజు రూ.2.43 కోట్లు చెల్లిస్తే 582 మందికి మాత్రమే ప్రొసీడింగ్ అందించారని వివరించారు. వెంటనే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ప్రొసీండింగ్లు అందించాలని కోరారు. లేని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
సీడీ ఆవిష్కరణ
చిట్యాల: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో చిట్యాల మండలంలోని చింతకుంట రామయ్యపల్లి గ్రామానికి చెందిన గూడెపు హర్షవర్ధన్ ఓరుగల్లుకు ‘ పోదాం పద ’ అనే పాటతో సీడీ రూపొందించాడు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సభా వేదిక ఏర్పాటు ప్రదేశంలో బుధవారం సీడీని ఆవిష్కరించారు. ఈసంద్భంగా గాయకుడిని కేటీఆర్ అభినందించారు. పాటను రచించిన కల్లెపెల్లి సతీష్, మ్యూజిక్ డైరెక్టర్ కిట్టు, సహకారం అందించిన తౌటం నవీన్కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అల్లం రవీందర్, మాజీ జెడ్పీటీసీ గొర్రె సాగర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్, పీఏసీఏస్ చైర్మన్ క్రాంతి కుమార్ రెడ్డి, రవీందర్ రావు, రాజేందర్, నవీన్, నాయకులు పాల్గొన్నారు.
కుక్కల దాడిలో
చిన్నారికి తీవ్రగాయాలు
చిట్యాల: అభం శుభం తెలియని చిన్నారి నైనిషాపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జడల్పేట గ్రామానికి చెందిన రత్న రమేష్ కుమార్తె నైనిషా బుధవారం ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా అక్కడే ఉన్న మూడు కుక్కలు ఆమెను వెంటాడి గాయపరిచాయి. దీంతో చిన్నారరి మెడ చుట్టూ, వీపుపై గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు మండల కేంద్రంలోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా చిన్నారి నైనిషాపై కుక్కలు దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ‘బాయిబాట’
భూపాలపల్లి అర్బన్: ఐఎన్టీయూసీ నాయకులు బుధవారం ఏరియాలోని కేటీకే 6వ గనిలో బాయిబాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 6వ గనిలో కార్మికులను మ్యాన్ రైడింగ్ సమస్య, పని స్థలాల్లో గాలి, తాగునీరు సరఫరా చేయాలనే సమస్యలను కార్మికులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బేతెల్లి మధుకర్రెడ్డి తెలిపారు. ఈ సమస్యలను వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. భూగర్బ గనిలోని వెళ్లి కార్మికుల పని స్థలాలను పరిశీలించి నేరుగా కార్మికుల సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో నాయకులు జోగు బుచ్చయ్య, హుస్సెన్, అశోక్, లక్ష్మీనారాయణ, రఘు పాల్గొన్నారు.

ఓపెన్ టెన్త్ పరీక్షల్లో 19మంది డీబార్