
చదువుతోపాటు విలువలు నేర్పించాలి
ములుగు: విద్యార్థులకు చిన్నప్పటి నుంచే చదువుతో పాటు ఉన్నత విలువలను నేర్పించాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కన్నయ్యలాల్ సూచించారు. అదనపు జూనియర్ సివిల్ జడ్జి సౌఖ్యతో కలిసి శనివారం జిల్లాకేంద్రంలోని బాలసదనంను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతులు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. వేసవికాలంలో విద్యార్థులు ముఖ్యంగా వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి సారించాలని చెప్పారు. ప్రభుత్వం నుంచి అందుతున్న ఫలాలను అంకితభావంతో విద్యార్థులకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్, ప్రొటెక్షన్ అధికారి కృష్ణవేణి, బాలసదనం మ్యాట్రీన్ అరుణ, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజలకు న్యాయవ్యవస్థకు
అనుసంధానంగా పనిచేయాలి
పారాలీగల్ వలంటీర్లు ప్రజలకు, న్యాయవ్యవస్థకు అనుసంధానంగా పనిచేయాలని సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్యలాల్ సూచించారు. జిల్లాకేంద్రంలోని కోర్టులో శనివారం న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వలంటీర్లకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి సౌఖ్య, బార్అసోసియేషన్ జనరల్ సెక్రటరీ భిక్షపతి, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిలర్ మహేందర్, డిప్యూటీ డిఫెన్స్ కౌన్సిలర్ స్వామిదాస్, న్యాయవాదులు కన్నోజు సునీల్కుమార్, రాజ్కుమార్, అశోక్, ప్రణయ్, సూర్య తదితరులు పాల్గొన్నారు.