
ఐటీడీఏ ఎదుట బస్షెల్టర్ నిర్మించాలి..
ఏటూరునాగారం మండలకేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ఉంది. కానీ ఎక్కువ మంది రోజు వారీగా ప్రయాణించే ఆకులవారి గణపురంలో ఐటీడీఏ భవనం ఎదుట ఎలాంటి షెల్టర్ లేదు. రోజు వారీగా ఉద్యోగులు ఎండలో ఇబ్బందులు పడుతూ చెట్ల నీడన నిలబడుతున్నారు. స్థానికులు సైతం బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడడానికి షెల్టర్ లేక షాపుల్లో ఉండాల్సి వస్తుంది. ఆర్టీసీ ఆధికారులు స్పందించి ఐటీడీఏ ఎదుట బస్షెల్టర్ ఏర్పాటు చేయాలి.
– కర్నె నాగేశ్వర్రావు,
ఏటూరునాగారం
కుర్చీలు
ఏర్పాటు చేయాలి..
వాజేడు మండలం నుంచి వెంకటాపురం(కె), నియోజకవర్గం భద్రాచలం, చర్ల మండలాలకు వెళ్లాలంటే జగన్నాధపురం జంక్షన్ నుంచి ప్రయాణించాల్సిందే. హైవే నిర్మాణంలో భాగంగా బస్ షెల్టర్ ఏర్పాటు చేసినా అధికారులు, ప్రయాణికులు కూర్చోవడానికి కుర్చీలు, బేంచీలను ఏర్పాటు చేయలేదు. అసలే ఏజెన్సీ, ఆపై బస్సుల కోసం గంటల తరబడి వేచి చూసే క్రమంలో చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్తో మాట్లాడి కుర్చీలు ఏర్పాటు చేయాలి.
– యాలం రామకృష్ణ, వాజేడు

ఐటీడీఏ ఎదుట బస్షెల్టర్ నిర్మించాలి..