
వైభవంగా ఉగాది వేడుకలు
ములుగు రూరల్: మండల వ్యాప్తంగా ఉగాది వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉగాది పచ్చడిని తయారు చేసుకొని కుటుంబసమేతంగా పండుగ చేసుకున్నారు. ఆలయాల్లో వేదపండితులు నూతన సంవత్సర పంచాంగాన్ని చదివి వినిపించారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నాయకులు ఉగాది వేడుకలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బలరాం ఆధ్వర్యంలో శివాలయం పూజా రి శివాచార్యులు పంచాంగాన్ని చదివి వినిపించారు.
వాజేడు: మండలంలో ప్రజలు భక్తి శ్రద్ధలతో ఉగాది పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి భక్తులు దేవాలయాలకు వెళ్లి పూజలు చేసుకోవడంతో రద్దీ పెరిగింది. ఇళ్లల్లో పిండి వంటలను చేసుకోవడంతో పాటు సహపంక్తి భోజనాలను చేసి ఆనందంగా గడిపారు.
ఐదురోజుల ఉగాది
విశ్వకర్మలు ఐదురోజుల ఉగాది పండుగను మడి బట్టలతో ప్రారభించారు. ఉదయం నాలుగు గంటల నుంచే పండుగ సంబరాలను చేపట్టారు. ఇంట్లో పెరుమాల్లు(పందిరి)ని కంక పుల్లలతో వేసి, మోదుగ పూలు, మామిడాకు తోరనాలను కట్టారు. తమ కుల వృత్తికి సంబంధించిన పని ముట్లను పూజలో ఉంచారు.
ఏటూరునాగారం: మండలంలోని ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని రామాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఏఎస్పీ శివం ఉపాధ్యాయ పాల్గొని పూజలు చేశారు.
వెంకటాపురం(కె): మండలంలో ఉగాదిని మండల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా కొందరు రైతులు ఏరువాక సాగారు. ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉగాది పచ్చడ తయారు చేశారు. సాయంత్రం మండల కేంద్రంలోని వేంకటేశ్వర స్వామి ఆలయం, శివాలయంలో పండితులు పంచాంగ శ్రవణం చేశారు.
రేగొండ: మండలంలోని పలు గ్రామాల్లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా మండల ప్రజలు ఉగాది పచ్చడితో పాటు బక్షాలు చేసుకుని పండుగను ప్రత్యేకంగా చేసుకున్నారు. అలాగే పురోహితులచే శ్రవణ పంచాంగాన్ని విన్నారు.
కోటంచలో..
మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు ఉగాది పర్వదినం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉగాది పచ్చడిని భక్తులకు పంపిణీ చేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో అర్చకులు బుచ్చమచార్యులు, శ్రీనాధచార్యులు భక్తులకు శ్రవణ పంచాంగాన్ని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ముల్కనూరి భిక్షపతి, ఆలయ సిబ్బంది రవిందర్, శ్రావణ్, సుధాకర్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మల్హర్: మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెల్లవారు జామునే లేచి సాన్నాలు ఆచరించి, పూజలు నిర్వహించారు. తాడిచర్ల స్థానిక వెంకటేశ్వర ఆలయం, పెద్దమ్మతల్లి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు. కుటుంబ సభ్యులందరూ కలసి ఆరు రుచులతో కలిగిన ఉగాది పచ్చడి సేవించి శుభాక్షాంక్షలు తెలుపుకున్నారు. సాయంత్రం సమయంలో వెంకటేశ్వర ఆలయ పూజారి పంచాంగ శ్రవణం గావించారు.
మొగుళ్లపల్లి/టేకుమట్ల: మండలాల్లోని అన్ని గ్రామాల్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఆలయాల్లో ఉగాది నూతన పంచాంగాన్ని పురోహితులు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలతో పాటు, నాయకులు పాల్గొన్నారు.
చిట్యాల: మండల కేంద్రంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ఉగాది పచ్చడి చేసి తాగారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని పాడిపంటలు పండాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు బుర్ర లక్ష్మన్ నాయకులు గుర్రపు తిరుపతి గౌడ్, దర్శనం, ఉయ్యాల రమేశ్, పెరుమాండ్ల రవీందర్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరం: మహదేవపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో విశ్రాంత ఉద్యోగుల సంఘం మండలశాఖ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి ఆదివారం పంపిణీ చేశారు. ఈసందర్భంగా మాజీ సర్పంచ్ శ్రీపతి బాపు మాట్లాడుతూ.. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి అమృత పానియం లాంటిదని, ఆరోగ్యానికి మేలు చేస్తుందనే నమ్మకంతో ఉగాది పచ్చడి సేవిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగ సంఘం నాయకులు ఆరెందల అంకన్న,శంకర్ సింగ్,విక్రమ్ సింగ్ పాల్గొన్నారు.

వైభవంగా ఉగాది వేడుకలు

వైభవంగా ఉగాది వేడుకలు

వైభవంగా ఉగాది వేడుకలు

వైభవంగా ఉగాది వేడుకలు

వైభవంగా ఉగాది వేడుకలు

వైభవంగా ఉగాది వేడుకలు