
ఓటీటీల్లో మిస్టరీ థ్రిల్లర్స్కు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. ఓటీటీలో ఇలాంటి కంటెంట్నే ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగానే అలాంటి సరికొత్త కంటెంట్తో వెబ్ సిరీస్లు, చిత్రాలు వచ్చేస్తున్నాయి. తాజాగా ఓటీటీ ప్రియులను అలరించేందుకు మరో సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వచ్చేస్తోంది. బాలీవుడ్ నటి వాణి కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన మండల మర్డర్స్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా వెల్లడించింది. జూలై 25 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కొత్త పోస్టర్ను నెట్ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈ సిరీస్లో వాణికపూర్ తొలిసారి డిటెక్టివ్ పాత్రలో కనిపించనుంది. ఈ సిరీస్లో వైభవ్ రాజ్ గుప్తా, సుర్వీన్ చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ను చరణ్దాస్పూర్ పట్టణం నేపథ్యంలో తెరకెక్కించారు. శతాబ్దాల క్రితం జరిగిన హత్యల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ను యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్కు గోపి పుత్రన్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ను ఆదిత్య చోప్రా, ఉదయ్ చోప్రా, యోగేంద్ర మోగ్రే, అక్షయ్ విధాని నిర్మించారు. 'ది రైల్వే మెన్' (2023) తర్వాత నెట్ఫ్లిక్స్, యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో వస్తోన్న సిరీస్ ఇదే కావడం విశేషం.
Har vardaan mein ek shraap chhupa hai, mol chukane ka waqt jald aane wala hai 🕸️
Watch Mandala Murders, out 25 July, only on Netflix.#MandalaMurders #MandalaMurdersOnNetflix #VaibhavRajGupta @SurveenChawla @ShriyaP #JameelKhan @gopiputhran @manan_rawat @MogreYogendra… pic.twitter.com/eQm3iX4x8a— Vaani Kapoor (@Vaaniofficial) June 30, 2025