కరోనాతో కళ్లముందే బావ, మామ మృతి: బుల్లితెర నటుడు
యశవంతపుర: ప్రభుత్వం కరోనా మహమ్మారిపై నిజాలను దాచిపెడుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. మా కుటుంబంలో ఇద్దరిని కరోనా బలి తీసుకొంది అని కన్నడ బుల్లితెర నటుడు పవన్కుమార్ శనివారం సోషల్మీడియాలో వీడియోలో ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా బారినపడి ఆస్పత్రుల్లో బెడ్లు దొరకక తన కళ్లముందే ముందే బావ, మామ మరణించారని తెలిపారు. ప్రభుత్వం ప్రజల సంరక్షణపై అబద్ధాలు చెబుతోంది, రాజకీయ నాయకులు చెబుతున్న మరణాల లెక్కలన్నీ తప్పని ఆరోపించారు. కరోనా నుంచి ఇప్పటికైనా ప్రజలను కాపాడాలన్నారు.
చదవండి: రజనీకాంత్పై విమర్శలు: జీవీ ప్రకాష్ చిత్రానికి సెన్సార్ వేటు
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు