వైజాగ్‌లో టైగర్‌ 

Tiger Nageswara Rao Movie Update - Sakshi

హీరో రవితేజ నటిస్తున్న తొలి పా న్‌ ఇండియా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నూపూర్‌ సనన్, గాయత్రీ భరద్వాజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకంపై అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్న ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చివరి షెడ్యూల్‌ వైజాగ్‌లో ప్రారంభమైంది.

వంశీ, అభిషేక్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ–‘‘స్టూవర్టు పురంలోని టైగర్‌ నాగేశ్వరరావు అనే గజదొంగ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోన్న చిత్రమిది. 1970ల నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ పా త్ర కోసం రవితేజ కంప్లీట్‌గా మేకోవర్‌ అయ్యారు. సరికొత్త బాడీ లాంగ్వేజ్, యాసతో అలరిస్తారు.

వైజాగ్‌లో ప్రారంభమైన చివరి షెడ్యూల్‌లో కీలక తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం. ఈ ఏడాది సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్, సహ నిర్మాత: మయాంక్‌ సింఘానియా, సంగీతం: జీవీ ప్రకాష్‌ కుమార్, కెమెరా: ఆర్‌. మధి.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top