Ticket Prices Hiked For Chiranjeevi Acharya Movie In Telangana, Know Price Details - Sakshi
Sakshi News home page

Acharya Ticket Prices: ఆచార్య సినిమా టికెట్‌ ధరల పెంపు

Apr 25 2022 4:55 PM | Updated on Apr 26 2022 2:26 PM

Ticket Prices Hiked For Chiranjeevi Acharya Movie In Telangana, Know Price Details - Sakshi

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌చరణ్‌ నటించిన చిత్రం​ ఆచార్య. సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆచార్య టికెట్‌ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఈనెల 29 నుంచి మే 5వరకు టికెట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం ఒక్కో టికెట్‌పై  మల్టీప్లెక్స్‌లో రూ. 50, సాధారణ థియేటర్స్‌లో రూ. 30 పెంచుకునేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా ఆచార్య ఐదో ఆట ప్రదర్శనకు వారం రోజుల పాటు అనుమతి కల్పించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement