సుశాంత్‌ కేసు ఇంకెన్నాళ్లు..?  | Sushant Die By Suicide Or Murder?: Asks CBI | Sakshi
Sakshi News home page

సుశాంత్‌ కేసు ఇంకెన్నాళ్లు..? 

Oct 3 2020 8:43 AM | Updated on Oct 3 2020 8:43 AM

Sushant Die By Suicide Or Murder?: Asks CBI - Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ది హత్యా? ఆత్మహత్యా ? ఎప్పటికి తేలుతుందని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ సీబీఐని సూటిగా ప్రశ్నించారు. ఈ కేసులో సీబీఐ కొనసాగిస్తున్న విచారణపై ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని అన్నారు.

శుక్రవారం మంత్రి దేశ్‌ముఖ్‌ మీడియాతో మాట్లాడుతూ.. సుశాంత్‌ మృతిపై ముంబై పోలీసులు సరైన దిశగా విచారణ చేస్తున్న సమయంలో హఠాత్తుగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చేతుల్లోకి ఈ కేసు వెళ్లిందన్నారు. వీలైనంత త్వరగా సీబీఐ అసలు నిజాలను రాబట్టాలన్నారు. ఇప్పటికే సీబీఐ విచారణ చేపట్టి 45 రోజులు గడిచినా ముందుకు అడుగు పడలేదని మంత్రి దేశ్‌ముఖ్‌ తెలిపారు. (సుశాంత్‌ కేసులో మరో మలుపు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement