
శివకార్తికేయన్( Sivakarthikeyan).. ఈ పేరు ఇప్పుడు విజయాలకు కేరాఫ్గా మారిందనే చెప్పాలి. అయిలాన్, మావీరన్, అమరన్ ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి మదరాసి. తమిళంలో కొంత గ్యాప్ తరువాత దర్శకుడు ఏఆర్.మురుగదాస్( A.R. Murugadoss) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. రుక్మిణి వసంత్ నాయకిగా నటిస్తున్న ఇందులో విద్యుత్ జమ్వాల్, విక్రాంత్, షబీర్, బిజూ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తి అయినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. కాగా ఈ చిత్ర షూటింగ్ మధ్యలో దర్శకుడు మురుగదాస్ హిందీలో సల్మాన్ఖాన్ హీరోగా సికిందర్ చిత్రాన్ని చేసే అవకాశం రావడంతో మదరాసి చిత్ర షూటింగ్లో జాప్యం జరిగిందనే ప్రచారం జరిగింది. కాగా సికిందర్ చిత్రం ఇటీవల తెరపైకి రావడంతో దర్శకుడు మురుగదాస్ మదరాసి చిత్రాన్ని పూర్తి చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. సెపె్టంబర్ 5న విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం.
అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. శివకార్తికేయన్ ఇంతకుముందు నటించిన సూపర్హిట్ చిత్రం అమరన్ తరువాత మదరాసి చిత్రం తెరపైకి రానుండడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొనడం సహజమే. శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న మరో చిత్రం పరాశక్తి. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.