Samantha: సమంత ఎక్కడ? ఎందుకు సైలెంట్‌గా ఉంది? కారణం ఇదేనా!

Reason Behind Samantha Silence On Social Media - Sakshi

గత కొంత కాలంగా నెట్టింట సమంత పేరు వినిపించని రోజంటూ లేదు.ఆమె నటించిన సాంగ్స్,  కనిపించే యాడ్స్ లేదా తన పర్సనల్‌ లైఫ్‌పై.. ఇలా ఏదో ఒక రకంగా సమంత పేరు ట్రెండింగ్‌లో కనిపిస్తూ ఉండేది. అలాంటి సమంత ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయింది. సోషల్ మీడియాలో కూడా యాక్టివిటీ లేదు. కొత్తగా ఫోటో షూట్స్, ఇంటర్వ్యూస్ ఇవ్వడం లేదు. సినిమా అప్ డేట్ కూడా లేదు. ఇంతకీ సమంత ఏం చేస్తున్నట్లు.. సామ్ సైలెన్స్ వెనుక రీజన్ ఏంటి? ఇప్పుడు టీటౌన్‌లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. 

(చదవండి: ఆంటీ లొల్లి.. అనసూయకు సపోర్ట్‌ చేసిన హీరోయిన్‌పై ట్రోలింగ్‌)

లాల్‌సింగ్‌ చడ్డా ప్రమోషన్స్‌ సమయంలో నాగచైతన్య బాలీవుడ్‌ వెళ్లినప్పటి నుంచి సమంత సైలెంట్‌ అయిపోయింది. సోషల్ మీడియాలో కూడా ఆమె యాక్టివిటీ పూర్తిగా తగ్గిపోయింది. మీడియాకు తమ పర్సనల్ లైఫ్ కంటెంట్ కాకూడదనే సమంత ఈ నిర్ణయం తీసుకుందనే టాక్ కూడా వినిపిస్తోంది.

మరో వైపు సమంత కొత్త సినిమాలపై ఫోకస్ పెట్టిందని, అందుకే ఆమె యాక్టివిటీ తగ్గిందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి సామ్ నటించిన యశోద, శాకుంతలం చిత్రాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ఓ హిందీ వెబ్ సిరీస్ నిర్మాణంలో ఉంది. దేవరకొండతో కలసి నటిస్తున్న ఖుషి నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ కావాల్సి ఉంది. త్వరలో సెన్సేషనల్ కమ్ బ్యాక్ తో సామ్ రీఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top