ది రాజాసాబ్‌ నిర్మాతకు అరుదైన గౌరవం | Producer Tg Vishwa Prasad gets West Bengal Governor Award of Excellence | Sakshi
Sakshi News home page

TG Vishwa Prasad: ది రాజాసాబ్‌ నిర్మాతకు అరుదైన గౌరవం

Jan 29 2026 7:29 PM | Updated on Jan 29 2026 7:52 PM

Producer Tg Vishwa Prasad gets West Bengal Governor Award of Excellence

టాలీవుడ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు బెంగాల్ గవర్నర్‌ ఎక్సలెన్స్‌ అవార్డ్ వరించింది. ఈ విషయాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తాజాగా ఈ అవార్డ్‌ను నిర్మాత అందుకున్నారు.  పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్ చేతుల మీదుగా తీసుకున్నారు.

కాగా.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో టీజీ విశ్వప్రసాద్ ఒకరు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతగా ఉన్నారు. ఇటీవలే ఈ బ్యానర్‌లో ప్రభాస్‌ నటించిన ది రాజాసాబ్ సంక్రాంతి కానుకగా రిలీజైంది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్ తెచ్చుకుంది. అభిమానుల అంచనాలు ది రాజాసాబ్‌ అందుకోలేకపోయింది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, రిద్ధికుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement