కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న నితిన్ | Nithiin Visits Tirumala Temple With His Family Video Goes Viral | Sakshi
Sakshi News home page

Nithiin: సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్న నితిన్

Jan 26 2025 7:04 AM | Updated on Jan 26 2025 7:33 AM

Nithiin Visits Tirumala Temple With His Family Video Goes Viral

టాలీవుడ్ హీరో నితిన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన భార్య షాలిని, కుమారుడితో కలిసి శ్రీవారికి మొక్కులు చెల్లించుకన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

కాగా.. ప్రస్తుతం హీరో నితిన్ రాబిన్‌హుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. భీష్మ తర్వాత వెంకీ కుడుముల- నితిన్ కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రానికి  జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. యునిక్‌ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా  ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

రిలీజ్ వాయిదా..

గతేడాది క్రిస్టమస్‌ విడుదల కావాల్సిన 'రాబిన్‌ హుడ్‌' వాయిదా పడింది. పుష్ప-2 ఇంకా థియేటర్లలో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత సంక్రాంతికి కూడా ఈ సినిమా రిలీజ్‌ కాలేదు. దీంతో వచ్చేనెల ఫిబ్రవరిలో రిలీజ్ ‍అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement