టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగచైతన్య కుర్చి నుంచి ఒక్కసారిగా కిందపడిపోయారు. తను హీరోగా నటిస్తున్ని కొత్త సినిమా 'వృషకర్మ' ఈవెంట్లో ఆయన పాల్గొన్నారు. ఈ మూవీ గ్లింప్స్ విడుదలలో భాగంగా ప్రసాద్ ఐమ్యాక్స్ పీసీఎక్స్ స్క్రీన్లో ఈవెంట్ నిర్వహించారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడేందుకు వేదికపై కుర్చీలను తీసుకొచ్చారు. నాగచైతన్యకు కేటాయించిన కుర్చిలో కూర్చోగానే అది ఒక్కసారిగా వంగిపోయింది.
దీంతో ఆయన వెనక్కిపడిపోయారు. వెంటనే చిత్ర యూనిట్ అప్రమత్తం కావడమే కాకుండా ఆయనకు ఏమైనా దెబ్బ తగిలిందేమోనని చూశారు. అంతలోనే చైతన్య కూడా ఎలాంటి గాయం కాలేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. నాగచైతన్య మరో కుర్చిలో కూర్చొని మీడియా చిట్చాట్ కొనసాగించారు. ఈవెంట్ సిబ్బందిపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు వీడియోలో తెలుస్తోంది. తక్కువ సమయంలోనే ఆయన మళ్లీ తన పంతాలో సరదాగా నవ్వుతూ వేదికపై కనిపించారు.
(వీడియో క్రెడిట్ చోటా న్యూస్ యాప్)
నాగచైతన్యకు తప్పిన ప్రమాదం..
హైదరాబాద్ ప్రసాద్స్ ఐమ్యాక్స్లో జరిగిన 'వృషకర్మ' ఈవెంట్లో హీరో నాగచైతన్యకు ప్రమాదం తప్పింది. స్టేజీపై ఆయన కూర్చున్న కుర్చీ అకస్మాత్తుగా వెనక్కి విరిగిపోగా, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పట్టుకోవడంతో గాయాలు కాలేదు. ఈ ఘటనతో కంగారుపడిన అభిమానులను చూసి,… pic.twitter.com/nSQXYsTFx7— ChotaNews App (@ChotaNewsApp) March 5, 2026


