Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ తొలి సాంగ్ ప్రోమో..
మహేశ్బాబు, కీర్తి సురేశ్ జంటగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. ఈ నెల 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి తొలి పాటను విడుదల చేస్తున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు మేకర్స్. ‘వందో.. ఓక వెయ్యో’ అంటూ మహేశ్ బాబు కీర్తి సూరేశ్ను ఫాలో అవుతుంటాడు.
మ్యూజిక్ సెన్సెషన్ తమన్ స్వరాలు అందించిన ఈ పాటను సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించాడు. పరశురాం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మైత్రీ మూవీ మేకరస్, 14 రీల్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ‘సర్కారు వారి పాట’ మే 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.