Prakash Raj: మంచు విష్ణు ప్యానెల్‌పై ప్రకాశ్‌రాజ్‌ ఫిర్యాదు

MAA Elections 2021: Prakash Raj Complaints On Manchu Vishnu Pannel - Sakshi

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా)  ఎన్నికల వివాదం మరింత ముదురుతుంది. మంచు విష్ణు ప్యానెల్‌పై ఎన్నికల అధికారికి ప్రకాశ్‌ రాజ్‌ ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని విష్ణు ప్యానెల్‌ ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. ఈ మేరకు తన ప్యానెల్‌ సభ్యులు శ్రీకాంత్‌, జీవితలతో కలిసి ఎ‍న్నికల అధికారికి ప్రకాశ్‌ రాజ్‌ ఫిర్యాదు చేశారు.చదవండి: Prakash Raj: 'పెద్దల ఆశీర్వాదం నొకొద్దు.. సత్తా ఉన్నవాడే గెలవాలి'

'మా ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ దుర్వినియోగం అవుతుంది. 60 ఏళ్లు పైబడిన వాళ్లు పోస్టల్‌ బ్యాలెట్‌కు అర్హులు ఏజెంట్ల ద్వారా పోస్టల్‌ బ్యాలెట్‌ కుట్ర చేస్తున్నారు. 60మందితో పోస్టల్‌ బ్యాలెట్‌లో తమకు అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించుకుంటున్నారు. కృష్ణం రాజు, చిరంజీవి, నాగార్జున సమాధానం చెప్పాలి' అంటూ ప్రకాశ్‌ రాజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: 'మా' ఎన్నికలు: కృష్ణం రాజును కలిసిన మంచు విష్ణు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top