'బేబీ' తర్వాత ఆనంద్ దేవరకొండతో వైష్ణవి చైతన్య నటించిన చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకుడు. ఇటీవలే ట్రైలర్ విడుదల కాగా మంచి స్పందన అందుకుంది. ఈ నెల 11న సినిమా విడుదల కానుంది. ఈ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ను మంగళవారం హైదరాబాద్లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
చదవండి: ‘నాతో పెట్టుకోవద్దు!’.. ఆటో రాంప్రసాద్ వార్నింగ్
ఇవే నేర్చుకున్నా..
‘విజయ్ దేవరకొండలో మీకు నచ్చిన అంశం ఏంటి’ అని యాంకర్ సుమ ఆనంద్ దేవరకొండను అడిగారు. ఆయన బదులుగా.. ‘మా అన్న దేనికీ భయపడరు. ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అసలు ఆయన భయంతోనే బతకరు అదే మా అన్నయ్య నుంచి నేర్చుకున్నా’ అని ఆనంద్ దేవరకొండ చెప్పారు. దీంతో అక్కడ ఉన్న విజయ్దేవరకొండ అభిమానులు సంబరపడ్డారు.
రణబాలి టీజర్..
కాగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. ఈ సినిమా అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో రేపు (సెప్టెంబర్ 9) టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.
Brothers Bonding 🥰
Ma anna #VijayDeverakonda దేనికీ భయపడడు. ఎలాంటి పరిస్థితినైనా Face చేస్తాడు, Attack చేస్తాడు.”
:- Hero #AnandDeverakonda #EPIC pic.twitter.com/NI0NAgOfSf— Milagro Movies (@MilagroMovies) September 8, 2026


