వైరల్‌ విశాలాక్షి కొత్తగా అనిపించింది | Eesha Rebba Talks About Maama Mascheendra Movie | Sakshi
Sakshi News home page

వైరల్‌ విశాలాక్షి కొత్తగా అనిపించింది

Oct 1 2023 5:17 AM | Updated on Oct 1 2023 10:40 AM

Eesha Rebba Talks About Maama Mascheendra Movie - Sakshi

సుధీర్‌బాబు త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. హర్షవర్ధన్‌ నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాళినీ రవి, ఈషా రెబ్బా హీరోయిన్లు. సోనాలీ నారంగ్, సృష్టి సమర్పణలో సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఈషా రెబ్బా మాట్లాడుతూ– ‘‘సుధీర్‌బాబుగారు చేసిన మూడు పాత్రల్లో దుర్గ పాత్రకు జోడీగా వైరల్‌ విశాలాక్షి పాత్ర చేశాను.

ఏదో ఒకటి చేసి వైరల్‌ కావాలనుకునే మనస్తత్వం విశాలాక్షిది. ఈ పాత్ర నాకు కొత్తగా అనిపించింది. ఈ సినిమా కథను హర్షవర్ధన్‌గారు చెప్పినప్పుడు కన్‌ఫ్యూజ్‌ అయ్యాను. కానీ సెట్స్‌లో క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం తమిళంలో విక్రమ్‌ ప్రభుతో ఓ సినిమా కమిట్‌ అయ్యాను. అలాగే నాకు మంచి గుర్తింపు తెచ్చిన ‘దయ’ వెబ్‌ సిరీస్‌ రెండో భాగం‘దయ 2’ వచ్చే సంవత్సరం ఆరంభమవుతుంది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement