టాలీవుడ్ సెలబ్రిటీలు జంటగా కనిపించారంటే వాళ్లిద్దరి గురించి పుకార్లు మొదలైపోతాయి. అలానే రీసెంట్ టైంలో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయిన జంట తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా. వీళ్లు ప్రేమలో ఉన్నారని రూమర్స్ గత కొన్నాళ్ల నుంచి వస్తున్నాయి. వాటిని నిజం అని చెప్పలేదు అలా అని ఖండించలేదు. మళ్లీ చాన్నాళ్ల తర్వాత హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వీళ్లిద్దరూ జంటగా కనిపించారు.
(ఇదీ చదవండి: 'టాక్సిక్' రొమాంటిక్ వీడియో సాంగ్.. పెద్దలకు మాత్రమే)
'పెళ్లిచూపులు', 'ఈ నగరానికి ఏమైంది' తదితర సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్.. ప్రస్తుతం నటుడిగా కొనసాగుతూనే ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ తీస్తున్నాడు. మరోవైపు తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బాతోనూ డేటింగ్లో ఉన్నాడనే టాక్ ఉంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తరుణ్.. ఈషా నాకు బెస్ట్ ఫ్రెండ్ కంటే ఎక్కువ అని చెప్పాడు. సరైన టైంలో పూర్తి వివరాలు బయటపెడతానని పేర్కొన్నాడు. లేటెస్ట్గా మరోసారి కనిపించడంతో మరోసారి ఈ జంట చర్చనీయాంశమైపోయారు.
(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ 'కలర్స్' స్వాతి.. ఫొటోలు వైరల్)
New Couple Very Soon ❤️✨😍#EeshaRebba #TharunBhascker pic.twitter.com/iaEvK4RW9h
— Hatoffcine (@Hatoffcine_) July 8, 2026
Actress Eesha Rebba and filmmaker Tharun Bhascker were spotted at the airport today. ✈️📸#EeshaRebba #TharunBhascker #Tollywood #AirportSpotted #CelebritySighting pic.twitter.com/eQU0ENZyMe
— Ramana (@pvramanakumar) July 8, 2026


