Chiranjeevi Emotional Tweet About Krishnam Raju Death - Sakshi
Sakshi News home page

Chiranjeevi: 'రెబల్‌ స్టార్‌కి నిజమైన నిర్వచనం కృష్ణంరాజు.. ప్రభాస్‌కి నా సంతాపం'

Sep 11 2022 11:30 AM | Updated on Sep 11 2022 12:57 PM

Chiranjeevi Emotional Tweet About Krishnam Raju Death - Sakshi

రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్‌ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్‌ ప్రముఖులు  దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు.

కృష్ణంరాజు గారు ఇక లేరు అనే వార్త విషాదకరం. మా ఊరి హీరో, చిత్ర పరిశ్రమలో నా తొలిరోజుల నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజు గారితో నాటి మనవూరి పాండవులు దగ్గరనుంచి నేటి వరకూ నా అనుబంధం ఎంతో ఆత్మీయమైనది. ఆయన రెబల్ స్టార్ కు నిజమైన నిర్వచనం. కేంద్రమంత్రిగా కూడా ఎన్నో సేవలందించారు.

ఆయనలేని  లోటు వ్యక్తిగతంగా నాకూ, సినీ పరిశ్రమకు, లక్షలాది మంది అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మశాంతించాలని ప్రార్ధిస్తూ, ఆయన కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడిలాంటి ప్రభాస్ కు నా సంతాపం తెలియచేసుకుంటున్నాను’ అని ఎమోషనల్‌గా ట్వీట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement