ఆ వార్తల్లో నిజం లేదు: సీబీఐ

CBI Comments On Sushant Singh Rajput Case - Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసుకు సంబంధించి సీబీఐ(కేంద్ర దర్యాప్తు సంస్థ) కీలక ప్రకటన విడుదల చేసింది. సుశాంత్‌  కేసుకు సంబంధించి మీడియాకు ఎలాంటి వివరాలు ఇవ్వలేదని,  సీబీఐ పేరుతో మీడియాలో వస్తున్న వార్తలు సరైనవి కావని సీబీఐ స్పష్టం చేసింది. అయితే సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తితో పాటు ఆమె తండ్రి, సోదరుడు షోవిక్‌ చక్రవర్తిని సీబీఐ విచారించింది. ఇక రియాపై మనీ లాండరింగ్‌ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆమె ఈడీ ఎదుట హాజరైన విషయం తెలిసిందే.

మరోవైపు సుశాంత్ కేసులో రియా చక్రవర్తి తల్లిదండ్రులను కూడా సీబీఐ  ప్రశ్నించింది. కాగా, తన కుమారుడిని మానసికంగా వేధించడంతోపాటు అతడి బ్యాంకు ఖాతాలో నుంచి డబ్బుని అక్రమంగా మళ్లించారని  సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ ఆరోపిస్తూ బిహార్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top