Subhash Chandra Tiwari: షూటింగ్ కోసం వచ్చి హోటల్ రూంలో శవమై కనిపించిన దర్శకుడు
Published
Thu, May 25 2023 12:27 PM
ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. షూటింగ్ కోసం ఓ హోటల్లో బస చేసిన దర్శకుడు శవమై కనిపించారు. వివరాల ప్రకారం.. భోజ్పురి డైరెక్టర్ సుభాష్ చంద్ర తివారీ ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రలో షూటింగ్ కోసం మూవీ టీం అందరితో కలిసి ఓ హోటల్లో బసచేశారు.
అయితే ఉదయం ఎంత పిలిచినా స్పందించికపోవడంతో అనుమానం వచ్చి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి తలుపులు బద్దలుకొట్టగా అప్పటికే తివారీ మృతిచెందారు. అయితే ఆయన మరణానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు.