-
బరిలోకి మరో ఇద్దరు భోజ్పురి సెన్సేషన్లు! బీజేపీ కసరత్తు
రానున్న లోక్సభ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ ప్రకటించిన అభ్యర్థి భోజ్పురి స్టార్ పవన్ సింగ్ పోటీ నుంచి తప్పుకొన్నారు. దీంతో ఆ స్థానంలో గట్టి అభ్యర్థిని నిలిపేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రస్థాయి నేతలతోపాటు ఢిల్లీ స్థాయిలోనూ అభ్యర్థి ఎంపికకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అసన్సోల్ లోక్సభ స్థానానికి ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను రాష్ట్ర యూనిట్ సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీలోని పార్టీ వర్గాలు ఇద్దరు భోజ్పురి సంచలనాలను అన్వేషిస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా వారిలో ఒకరు బెంగాలీ అయినప్పటికీ భోజ్పురి చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధి చెందారు. బెంగాల్ బీజేపీ సూచించింది వీరినే.. బెంగాల్ బీజేపీ సూచించిన పేర్లు అగ్నిమిత్ర పాల్, జితేంద్ర తివారీ, డాక్టర్ అజయ్ పొద్దార్. వీరిలో అగ్నిమిత్ర పాల్ వైద్యురాలు, విద్యావేత్తల కుటుంబంలో జన్మించారు. కానీ ఫ్యాషన్ డిజైనింగ్ని ప్రవృత్తిగా ఎంచుకున్నారు. శ్రీదేవి, మిథున్ చక్రవర్తి, కేకే మీనన్ వంటి బాలీవుడ్ తారలకు ఆమె కాస్టూమ్స్ రూపొందించారు. 2019లో లోక్సభ ఎన్నికలకు ముందు ఆమె బీజేపీలో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె అసన్సోల్ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక మరో సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద్ర తివారీ 2020లో బీజేపీలో చేరారు. హిందీలో అనర్గళంగా మాట్లాడగల ఆయన గణనీయమైన సంఖ్యలో హిందీ మాట్లాడే ఓటర్లను ప్రభావితం చేయగలడని పార్టీ భావిస్తోంది. ఆయన గతంలో అసన్సోల్ మేయర్గానూ పనిచేయడం మరింత కలిసొచ్చే అంశం. అలాగే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కుల్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్ అజయ్ పొద్దర్ను కూడా స్థానిక పార్టీ పరిశీలిస్తోంది. మరో ఇద్దరు భోజ్పురి సంచలనాలు పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ స్థానానికి ఢిల్లీలోని బీజేపీ నాయకత్వం ఇద్దరు భోజ్పురి సంచలనాలను అన్వేషిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భోజ్పురి చిత్రాల బెంగాలీ స్టార్ 'మోనాలిసా'పై కాషాయ పార్టీ ప్రత్యేక ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు. ఆమె అసలు పేరు అంటారా బిస్వాస్. హిందీ టెలివిజన్లో పేరు సంపాదించడంతో పాటు భోజ్పురి సినీ పరిశ్రమలోనూ సంచలనంగా మారారు. ఆమెకు బెంగాలీ, హిందీ, భోజ్పురి భాషల్లో కూడా ప్రావీణ్యం ఉంది. అందుకే ఆమెను అసన్సోల్ నుంచి పోటీ చేయించే అంశాన్ని బీజేపీ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. మోనాలిసా బిగ్ బాస్-10లోనూ కంటెస్టెంట్గా పాల్గొన్నారు. దక్షిణ కోల్కతాలోని జూలియన్ డే స్కూల్లో చదువుకున్న ఆమె కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలయ్యారు. భోజ్పురి పరిశ్రమలో సెన్సేషన్ అయిన మోనాలిసా భోజ్పురి స్టార్నే వివాహం చేసుకున్నారు. ఇక పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరైన మరో భోజ్పురి సంచలనం అక్షరా సింగ్ను రంగంలోకి దించే అవకాశాలను కూడా బీజేపీ పరిశీలిస్తోందన్న ఊహాగానాలు ఉన్నాయి. 'మోనాలిసా' కంటే పెద్ద స్టార్ అయినప్పటికీ అక్షరా సింగ్ విషయంలో కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. ఈమెకు బెంగాలీ నేపథ్యం లేకపోవడం, పవన్ సింగ్తో గత అనుబంధం. బీజేపీ అధిష్టానం ఈ ఐదుగురిలో ఒకరిని ఎంపిక చేస్తుందా లేక ఇంకెవరైనా కొత్తవారికి అవకాశం ఇస్తుందా అన్నది చూడాలి. -
లెజెండరీ సింగర్ పంకజ్ ఉదాస్ కన్నుమూత
మ్యూజిక్ లెజెండ్, పద్మశ్రీ గ్రహీత పంకజ్ ఉదాస్ (72) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తను పంకజ్ కూతురు నయాబ్ ఉదాస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా పంకజ్.. 1951లో గుజరాత్లోని జెటూర్లో జన్మించారు. చదువుకునే వయసులోనే ఆయన కుటుంబం ముంబైకి షిఫ్ట్ అయింది. తన అన్నయ్య మన్హర్ ఉదాస్ బాలీవుడ్లో ప్లేబ్యాక్ సింగర్గా రాణించారు. రెండో అన్న నిర్మల్ గజల్ గాయకుడిగా పేరు గడించారు. వారి బాటలోనే పంకజ్ కూడా నడిచారు. 1970లో వచ్చిన తుమ్ హసీన్ మే జవాన్ సినిమాలో తొలిసారి పాట ఆలపించారు. నామ్(1986) సినిమాలో పాడిన చ్టిటి ఆయూ హై పాట పంకజ్కు గుర్తింపు తెచ్చిపెట్టింది.అప్పటినుంచి మూడు దశాబ్దాల పాటు తన గాత్రంతో ప్రేక్షకులను అలరించారు.'చిట్టి ఆయిహై ఆయూహై.. చిట్టీ ఆయిహై..', 'చాంది జైసా రాంగ్ హై తేరా.. ఔర్ ఆహిస్తా కిజియే బాతే', 'తోడితోడి పియా కరో..' ఇలా బాలీవుడ్లో ఎన్నో అద్భుతమైన సాంగ్స్ ఆలపించారు. సొంతంగా మ్యూజిక్ ఆల్బమ్స్ రిలీజ్ చేశారు. గజల్ సింగర్గా ఎక్కువ ప్రసిద్ధి పొందారు. పంకజ్ సేవలను గుర్తించిన కేంద్రం 2006లో పద్మశ్రీతో సత్కరించింది.చదవండి: TV Serial Actress Story: ఛాన్స్ కోసం ఆ పని చేయాలి.. వద్దని చెత్త ఏరుకుంది.. తర్వాత లక్షలు ఆర్జిస్తూ.. -
Akshara Singh: హీరోయిన్ షోపై రాళ్ల దాడి.. వీడియో వైరల్
భోజ్పురి ప్రముఖ నటి, గాయని అక్షర సింగ్ నిర్వహించిన ఓ లైవ్ షో స్వల్ప ఉద్రిక్తలకు దారి తీసింది. ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో తోపులాట జరిగింది. ఫ్యాన్స్ని అదుపు చేసేందకు పోలీసులు లాఠీచార్జ్ చేయగా..కొంతమంది తిరగబడి పోలీసులపై రాళ్ల దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ హీరోయిన్ అక్షర సింగ్కి భోజ్పురిలో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె కేవలం నటి మాత్రమే కాదు, మంచి గాయని, డ్యాన్సర్ కూడా. తాజాగా అక్షర బిహార్లోని జౌరంగాబాద్ జిల్లాలో ఓ షాప్ ఓపెనింగ్కి వెళ్లింది. (చదవండి: నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే: సమంత) పేపర్ ప్రకటన ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు.. పెద్ద ఎత్తున ఆ షాపింగ్ మాల్కి తరలి వచ్చారు. కాస్త ఆలస్యంగా వచ్చిన అక్షర.. స్టైజ్పైకి వెళ్లి ఓ అద్భుతమైన పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ సమయంలో ఫ్యాన్స్ మధ్య తోపులాట జరిగింది. దీంతో వారిని అదుపు చేసేకుందు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అనంతరం అక్షర సింగ్ని అక్కడ నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ పోలీసులపై రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో చాలా మంది అభిమానులతో పాటు పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పోలీసులు అక్షర సింగ్కి రక్షణ కవచంగా మారి అక్కడి నుంచి సేఫ్గా పట్నాకు తరలించారు. ఈ ఘటనపై ఓ పోలీస్ అధికారి స్పందిస్తూ.. అక్షర చాలా ఆలస్యంగా కార్యక్రమానికి చేరుకుందని, దీంతో అక్కడ ఉన్న జనం అసహనానికి గురై రచ్చ సృష్టించారని తెలిపారు. (చదవండి: ఏం చేస్తోందసలు.. యాక్టింగా? గుర్తుపట్టడం కష్టమే!) 2010లో విడుదలైన సత్యమేవ జయతే అనే భోజ్పురి సినిమాతో అక్షర సింగ్ వెండితెరకు పరిచయమయ్యారు. తనదైన నటనతో తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో అక్షరకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. 2015లో కాల టీకా, సర్వీస్ వాలి బాహు అనే హిందీ టెలివిజన్ సిరీస్లలో నటించారు. కొన్నాళ్ల తర్వాత సినిమా అవకాశాలు తగ్గాయి. దీంతో 2021లో బిగ్బాస్ ఓటీటీ వర్షన్లో పాల్గొంది. #Bhojpuri star Akshara Singh पर Fans ने फेंके पत्थर, बेकाबू भीड़ पर Police ने किया लाठीचार्ज#Akshara #AksharaSingh #BhojpuriSongs #Bihar #AksharaSinghNews #AksharaSinghSongs #AksharaSinghHot #BhojpuriNews #Bollywood #Bhojiwood #BhojpuriMovies #BhojpuriFilms #PawanSingh pic.twitter.com/hPwCDe784o — JAYANTIKA TRIPATHI (@Jayantika_t) January 18, 2024 It’s late cold but still fans in thousands came to sherni event in Daudnagar..that’s the love she has earned. Some Bollywood stars don’t have such craze as humari bhojpuri Queen @AKSHARASINGH1 . #Bollywood #Bhojpuri #AksharaSingh #BiggBoss 🔥🔥🔥🔥 pic.twitter.com/z73tBwHKdB — Sherni Akshara Fan (@queen_twirl3) January 17, 2024 -
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. పొట్టకూటి కోసం భిక్షాటన చేస్తూ..
ఒక్కోసారి మన కళ్లు మనల్నే మోసం చేస్తున్నాయా? అనిపిస్తుంది! రంగుల ప్రపంచంలో ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న కొందరు తారలు తర్వాత గుర్తుపట్టలేని స్థితికి మారిపోయారు. చేతినిండా డబ్బులుండే స్థితి నుంచి ఒకరి దగ్గర చేతులు చాచి అడగాల్సిన పరిస్థితికి దిగజారిపోయారు. తెలుగు, తమిళం, హిందీ అని కాకుండా అన్ని భాషల్లోనూ ఇలాంటి దుస్థితిని ఎదుర్కొన్న తారలు ఉన్నారు. ఒకప్పటి ఆ సెలబ్రిటీయేనా ఇలాంటి హీనస్థితిలో ఉంది? అని అభిమానులు కళ్లు చెమర్చుకున్న రోజులున్నాయి. హీరోయిన్ మిథాలి శర్మ కూడా అందనంత ఎత్తుకు వెళుతుందనుకుంటే అందరి దగ్గర భిక్షమడిగే స్థాయికి దిగజారింది. అందుకు గల కారణాలేంటి? అసలు తనకు ఏమైంది? అనేది ఈ కథనంలో చదివేద్దాం.. ఇంటితో సంబంధం కట్ మిథాలి శర్మ.. భోజ్పురిలో ఫేమస్ హీరోయిన్. ఈమె స్వస్థలం ఢిల్లీ. ఎప్పటికైనా టీవీలో కనిపించాలనుకున్న ఆమె అందుకోసం ఇంటి నుంచి పారిపోయింది. ఒంటరిగా ముంబై వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడే ఆమెతో సంబంధాలు తెంచేసుకుంది మిథాలి కుటుంబం. ఇక ముంబైలో చెప్పులరిగేలా తిరిగిన మిథాలి తొలుత మోడలింగ్ చేసింది. తర్వాత సినిమాలు చేసింది, బాగానే క్లిక్ అయింది. దీంతో దర్శకనిర్మాతలు ఈమెతో సినిమా తీసేందుకు పోటీపడ్డారు. ఆ రేంజ్లో క్రేజ్ అందుకుంది. పని దొరక్క డిప్రెషన్లోకి.. కానీ, సడన్గా అంతా మారిపోయింది. అదృష్టం బాలేకపోతే అరటిపండు తిన్నా పన్ను విరుగుతుందన్నట్లు తన జీవితంలో బ్యాడ్ టైమ్ మొదలైంది. తను చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్టాక్ను మూటగట్టుకున్నాయి. అవకాశాలు తగ్గిపోయాయి. చాలాకాలం చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉండాల్సి వచ్చింది. నెలలు కావస్తున్నా పని దొరక్కపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. అలాగే కూర్చుంటే కడుపు నిండదు కదా.. పొట్టకూటి కోసం ఏదో ఒక పని చేయాలనుకుంది. అందుకే భిక్షాటన మొదలుపెట్టింది. ముంబై వీధుల్లో కనిపించినవారినల్లా నాలుగు రూపాయలు దానం చేయమని కోరింది. భిక్షాటన చేస్తూ పోలీసులకు దొరికిన హీరోయిన్ ఆ మధ్య ముంబై లోఖండ్వాలాలో భిక్షాటన చేస్తున్నవారిని పోలీసులు అరెస్ట్ చేయగా అందులో మిథాలి శర్మ కూడా ఉంది. తన చేతికి మహిళా పోలీసు బేడీలు వేస్తుంటే మిథాలి ఆమెను తిట్టిందని, అక్కడి నుంచి పారిపోవడానికి కూడా ప్రయత్నించిందని వార్తలు వచ్చాయి. చివరకు ఆమెను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లగా మిథాలి తనకు కాస్త అన్నం పెట్టమని అడిగిందట! దీంతో ఆమెకు అన్నం పెట్టి ఆకలి తీర్చిన పోలీసులు తన మానసిక స్థితి సరిగా లేదని గ్రహించారు. దీంతో తనను మానసిక వికలాంగుల ఆశ్రమంలో చేర్పించినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం మిథాలి శర్మ ఎక్కడుంది? ఎలా ఉంది? అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. చదవండి: సినీప్రియులకు అదిరిపోయే న్యూస్.. ఒకే సినిమాలో ఇద్దరు లెజెండరీ హీరోలు! -
నమ్మించి దారుణం.. నటిపై రెండుసార్లు అత్యాచారం..!
ప్రముఖ భోజ్పురి నటి ప్రియాన్స్ సింగ్ సంచలన ఆరోపణలు చేసింది. తన సహా నటుడు పునీత్ సింగ్ అత్యాచారం చేశాడని ఆరోపింంచింది. తనపై చాలా అసభ్యంగా ప్రవర్తించాడంటూ గతనెల 29న పోలీసులను ఆశ్రయించింది. తనతో అసహజమైన పనులు చేశాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. (ఇది చదవండి: ఏకంగా తొమ్మిది చిత్రాలు.. ఆ దర్శకుల్లో టాప్ ఎవరంటే.. రాజమౌళి మాత్రం!) ప్రియాంక మాట్లాడుతూ.. 'నా కెరీర్లో బాగా పని చేస్తున్న సమయంలోనే సోషల్ మీడియాలో పునీత్ సింగ్ రాజ్పుత్ని కలిశా. ఆ తర్వాత నాతో మాట్లాడటం ప్రారంభించాడు. మొదట నాతో చాలా మర్యాదగా వ్యవహరించేవాడు. చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాలనేది అతని కోరిక. నా పరిచయాల ద్వారా అతనికి సాయం చేశా. దీంతో అతనిపై పూర్తి నమ్మకం ఏర్పడింది. నన్ను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ చెప్పేవాడు. ఆ తర్వాత మా ఇంటికి రావడం మొదలెట్టాడు.' అంటూ చెప్పుకొచ్చింది. ప్రియాంక మాట్లాడుతూ.. 'ఒక రోజు నేను ఒంటరిగా ఉన్నప్పుడు మద్యం తాగి మా ఇంటికి వచ్చాడు. నాపై బలవంతంగా అత్యాచారం చేశాడు. నా జుట్టు పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. మరుసటి రోజు ఉదయం అతను స్పృహలోకి వచ్చాక.. పోలీసులకు కంప్లైంట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చా. ఏడ్చి నన్ను క్షమించమని వేడుకున్నాడు. ఆ తర్వాత తన కుటుంబాన్ని ఒప్పించి.. త్వరలో పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. ఇటీవల మరోసారి నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నాకు అతనిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. . నాకు న్యాయం కావాలి. అతనికి వీలైనంత త్వరగా శిక్ష విధించాలి.' అని డిమాండ్ చేసింది. (ఇది చదవండి: హీరో అవ్వాలనుకున్నా, సీక్రెట్గా పెళ్లి.. ఇండస్ట్రీలో కష్టాలు..: గడ్డం నవీన్)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
Advertisement