లవ్‌ యూ బేబీ.. అత్యంత మధుర క్షణాలు

Anita Hassanandani Rohit Reddy Welcome Baby Boy Wishes Pour In - Sakshi

తల్లిదండ్రులైన నటి అనిత- రోహిత్‌రెడ్డి దంపతులు

ముంబై: నటి అనిత హసానందాని, రోహిత్‌ రెడ్డి దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం అనిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. భార్యను ఆత్మీయంగా ముద్దాడుతున్న ఫొటోను షేర్‌ చేసిన రోహిత్‌రెడ్డి ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ‘‘లవ్‌ యూ బేబీ.. మన జీవితంలోని అత్యంత మధురు క్షణాలు ఇవే’’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఏక్తా కపూర్‌, సమీరారెడ్డి, హీనా ఖాన్‌, నకుల్‌ మెహతా, కరణ్‌ వీర్‌ వోహ్రా తదితరులు విషెస్‌ తెలిపారు. ఇక.. ‘‘రెడ్డి కోసం వేచి చూస్తున్నాం’’ అంటూ తాను తల్లికాబోతున్న విషయాన్ని అనిత క్యూట్‌ వీడియో ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. డిసెంబరులో ముంబైలో నిర్వహించిన అనిత సీమంతంలో ఏక్తా కపూర్‌ సహా పలువురు సెలబ్రిటీలు హాజరై సందడి చేసిన ఫొటోలు కూడా ఆమె షేర్‌ చేశారు. కాగా ‘నువ్వు- నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన అనిత‌ తర్వాత హిందీ బుల్లితెరపై దృష్టి సారించారు. యే మొహబ్బతే, నాగిని వంటి హిట్‌ సీరియల్స్‌లో నటించారు.

ఇక వ్యక్తిగత జీవితం విషయానికొస్తే... బిజినెస్‌మేన్‌ రోహిత్‌రెడ్డిని ప్రేమించిన ఆమె.. 2013లో ఆయనను పెళ్లాడారు. ఇక వైవాహిక బంధంలో అడుగుపెట్టిన ఏడేళ్ల తర్వాత వీరు ఫిబ్రవరి 9న తమ తొలి సంతానానికి జన్మనిచ్చారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తమ జీవితాల్లోకి చిన్నారి రావడంతో ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు. కాగా భార్యను ఎల్లప్పుడూ ప్రోత్సహించే రోహిత్‌ రెడ్డి, డాన్స్‌ రియాలిటీ షో "నాచ్ బ‌లియే 9" సీజ‌న్‌లో ఆమెతో కలిసి పాల్గొన్నారు.

చదవండి‘అమ్మ పొట్టలో ఎవరున్నారు జాకీ‌.. చెల్లెలు’

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top