పూజారి పాత్రలో నటిస్తున్న ఆదిత్య ఓం..!

Aditya Om Stunning Look In His New Movie - Sakshi

‘ప్రేమలో పావని కల్యాణ్‌’ ,‘లాహిరి లాహిరి లాహిరి’ వంటి పలు వెరైటీ చిత్రాలతో ఆకట్టుకొన్న నటుడు ఆదిత్య ఓం హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘దహనం’. ఈ మూవీలో ఆదిత్య కొంతమంది బడా వ్యాపారవేత్తల నుంచి నుంచి గుడిని కాపాడుకునే పూజారి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా లో ఆదిత్య 1980వ కాలంలో సాగే అప్పటి కాలం వ్యక్తిగా కనిపించబోతున్నాడు. అందుకు తగ్గ మేకోవర్ కూడా పూర్తి చేశాడు. ఓపెన్ ఫీల్డ్ మీడియా బ్యానర్ పతాకంపై డాక్టర్ పి సతీష్ కుమార్, డాక్టర్ అర్ బలరాం సాయిలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఎడారి మూర్తిసాయి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి డాక్టర్ పి సతీష్ కుమార్ బాణీలను సమకూరుస్తున్నారు. ఎఫ్ఎం బాబాయి, శాంతి చంద్రలు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.  కాగా ఇప్పటికి ఈ సినిమా విశాఖపట్నం చుట్టుపక్కల  పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. కె.విశ్వనాథ్, బాపుల సినిమాల మ్యాజిక్ ఫీల్ ఈ సినిమాలో ఉండబోతుందని, త్వరలోనే  ఈ మూవీ ఫస్ట్‌లుక్‌,  ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top