పార్లమెంట్కు చీకోడ్ విద్యార్థి
పాపన్నపేట(మెదక్): ‘మన నాయకుడిని తెలుసుకోండి ’కార్యక్రమం పేరిట ఎంపికై న చీకోడ్– లింగాయపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థి శివ చైతన్య శనివారం ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాలలో పదో తరగతి చదవుతున్న శివ చైతన్య ఎన్సీఈఆర్టీ ద్వారా ఈ కార్యక్రమానికి ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపిక కాగా, జిల్లా నుంచి ఒకే విద్యార్థి ఎంపిక కావడం విశేషం. ఈ మేరకు పార్లమెంట్ ప్రతినిధి శివచైతన్యకు బహుమతి అందజేశారు. గైడ్ టీచర్గా కిషన్ ప్రసాద్ వ్యవహరించారు.


