ప్లాస్టిక్ భూతం!
బాబోయ్..
ప్రజల్లో మార్పు రావాలి
ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజ ల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. పాలిథీన్ కవర్లకు బదులు ఇతర సంచులు వాడాలి. తద్వారా ప్లాస్టిక్ నిర్మూలన సాధ్యమవుతుందని చెబుతున్నాం. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే వంద శాతం ప్లాస్టిక్ నిర్మూలన సాధ్యమవుతుంది.
–శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, మెదక్
● అడ్డగోలుగా వినియోగం
● పొంచి ఉన్న పెను ప్రమాదం
● నిషేధం అమలయ్యేనా?
● ఆచరణలో కానరాని ఫలితం
మెదక్ మున్సిపాలిటీ: ఉదయం నుంచి నిద్రించే వరకు ప్లాస్టిక్తో మానవ జీవితం ముడిపడి ఉంటోంది. అంతలా కలిసిపోయిన ప్లాస్టిక్ వల్ల పర్యావరణంతో పాటు మానవాళికి పెను ముప్పు పొంచి ఉంది. ఇది తెలిసినా ప్లాస్టిక్ను అడ్డగోలుగా వినియోగిస్తూనే ఉన్నాం. పర్యావరణ వేత్తలు, ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా.. కొద్దిగానైనా మార్పు రావడం లేదు. నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఫలితంగా వీటి వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. పట్టణంలోని వీధుల్లో, రోడ్ల పక్కన, నివాస గృహల సమీపంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్ధాలే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న తక్కువ ఉన్న ప్లాస్టిక్పై నిషేధం ఉండేది. ప్రస్తుతం 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్పై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సమస్యలను అధిగమించాలంటే వ్యక్తిగతంగా, సమష్టిగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని.. అప్పుడే పర్యావరణ ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రోజుకు 3 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు
మెదక్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 20 వేల నివాస గృహాలు, దుకాణాలు ఉన్నాయి. 10 ఆటో లు, ఏడు ట్రాక్టర్లతో పట్టణంలో చెత్త సేకరణ చేస్తున్నారు. ప్రతిరోజు 18 టన్నుల చెత్త పోగవుతోంది. అందులో 3 టన్నుల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. అడపా దడపా ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, హోట ళ్లు, దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నారు. రూ. 5000 నుంచి రూ.20వేల వరకు జరిమానా సైతం విధిస్తున్నారు. తదనంతరం అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా తిరిగి వాటి విక్రయాలను కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏళ్ల తరబడి ప్రణాళిక రూపొందిస్తున్నా.. కౌన్సిల్లో తీర్మానాలు చేస్తున్నా.. అమలులో క్షేత్రస్థాయి లోపాలతో అడ్డుకట్ట పడటం లేదు.
ముమ్మరంగా తనిఖీలు
ప్రస్తుతం ప్లాస్టిక్ నిషేధానికి అధికారులు మళ్లీ నడుం బిగించారు. గడిచిన కొన్ని రోజులుగా మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన మెదక్లో ప్లాస్టిక్ విక్రయాలు, వినియోగంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. నిత్యం ఉదయం, సాయంత్రం వేళలో దుకాణాలపై దాడులు చేసి చర్యలు తీసుకుంటున్నారు. కూరగాయల మార్కెట్తోపాటు హోల్సెల్, రిటేల్ దుకాణాలు, వైన్స్లు, పర్మిట్ రూంలలో, స్వీట్హౌస్లు, హోటళ్లలో వినియోగిస్తున్న ప్లాస్టిక్ కవర్లను వాడకుండా కఠినంగా చర్యలు చేపడుతున్నారు. ఆయా పార్టీల నుంచి రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా ఎక్కడా తగ్గకుండా దాడులు కొనసాగిస్తూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం మెదక్ పట్టణంలోని ఆటోనగర్, వెల్కంబోర్డు ప్రాంతంలోని హోటళ్లు, స్వీట్హౌజ్లలో తనిఖిలు నిర్వహించగా హోటల్కు రూ.10వేల జరిమాన విధించారు.
ప్లాస్టిక్ భూతం!


