ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య

Apr 22 2025 7:01 AM | Updated on Apr 22 2025 7:01 AM

ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య

ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య

డీఈఓ రాధాకిషన్‌

రామాయంపేట(మెదక్‌): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని డీఈఓ రాధాకిషన్‌ అన్నారు. సోమవారం మండలంలోని ప్రగతి ధర్మారంలో ముందస్తుగా ఏర్పాటు చేసిన బడిబాట కా ర్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. నూతన అడ్మిషన్ల కోసం ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. అనంతరం బడిబాట కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు త దితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement