
భూ భారతితో సమస్యలకు చెక్
కౌడిపల్లి/కొల్చారం(నర్సాపూర్): భూభారతి చట్టంతో భూ సమస్యలు త్వ రగా పరిష్కారం అవు తాయని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఆదివారం మండలకేంద్రంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్య ఉన్న భూములపై రైతులు ఫిర్యాదు చేస్తే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారని తెలిపారు. భూమి సర్వే నంబర్, సరిహద్దుల పూర్తి వివరాలతో త్వరలో రైతులకు భూదార్ నంబర్ కేటాయిస్తామన్నారు. జూన్ 2వ తేదీ నుంచి అన్ని గ్రామాల్లో సదస్సులు నిర్వహించి భూ భారతి ద్వారా సమస్యలు పరిష్కరిస్తామన్నారు. సమస్య ఉన్న రైతులు తహసీల్దార్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని, గ్రామసభలో ఫిర్యాదు చేస్తే సరిపోతుందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్రెడ్డి, ఏడీఏ పుణ్యవతి, తహసీల్దార్ ఆంజనేయులు, ఏఓ స్వప్న, ఆర్ఐ శ్రీహరి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. అనంతరం కొల్చారం మండల కేంద్రంలోని రైతు వేదికలో కలెక్టర్ కొత్త చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. కొత్త చట్టంలో మార్పులు చేసేందుకు తహసీల్దార్లకు అధికారం ఉంటుందని.. ఇక కలెక్టర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. త్వరలో కొత్త చట్టాన్ని జిల్లాలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వాటికి త్వరలోనే పరిష్కారం చూపుతామని చెప్పారు. భూ భారతి చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
కలెక్టర్ రాహుల్రాజ్