
ప్రతి గింజ కొనుగోలు చేస్తాం
సన్న బియ్యం పేదలకు వరం
కలెక్టర్ రాహుల్రాజ్
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం
కొల్చారం(నర్సాపూర్): సన్న బియ్యం పథకం నిరుపేద కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుందని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. సోమ వారం మండల పరిధిలోని రాంపూర్లో పారిశుద్ధ్య కార్మికుడు దుర్గారాజు ఇంటిలో కలెక్టర్ భోజనం చేశారు. కుటుంబ సభ్యుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 520 రేషన్ షాపులకు గాను 7 లక్షల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నాణ్యత గల సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. గతంలో దొడ్డు బియ్యం రేషన్ షాపుల ద్వారా తీసుకొని బయట విక్రయించే వార న్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, ఎంపీడీఓ రఫీ ఉన్నిసా, తహసీల్దార్ గఫార్మియా, ఎంపీఓ కష్ణవేణి, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.
త్వరలోనే ఇంటర్ ఫలితాలు
మెదక్జోన్: త్వరలోనే ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు వెల్లడి కానున్నాయని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. సోమవారం పట్టణంలోని బాలుర జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఇంటర్ మూల్యాంకన సెంటర్ను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ముగిసిందని.. ప్రస్తుతం రీకౌంటింగ్, రీవాల్యువేషన్ ప్రక్రియ నడుస్తుందన్నారు. కాగా 690 మంది అధ్యాపకులు మూల్యాంకన ప్రక్రియలో పాల్గొని దాదాపు 1.87 లక్షల జవాబు పత్రాలు మూల్యాంకనం చేశారని తెలిపారు. అంతకు ముందు కలెక్టర్ టెలీ కాన్ఫరెనన్స్ ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడారు. రాజీవ్యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
నిజాంపేట(మెదక్): రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని కె. వెంకటాపూర్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వం రైతులను ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ హయా ంలో నిరుపేదలకు సన్న బియ్యంతో పాటు ముందుగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. తేమశాతం 17 ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. రామాయంపేటలో రూ. 200 కోట్లతో సమీకృత గురుకులం పనులు ప్రారంభించనున్న ట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శ్రీనివాస్రావు, మండల డిప్యూటీ తహసీల్దార్ రమ్యశ్రీ, మండల వ్యవసాయ అధికారి సోమ లింగారెడ్డి, ఎంపీడీఓ రాజిరెడ్డి, నాయకులు మహేందర్, లింగంగౌడ్, అమరసేనారెడ్డి, అజయ్, సామల మహేష్ వెంకటేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్ రూరల్: మండలంలోని తుజాల్పూర్లో సోమవారం డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. దానిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుడిపై ఉందని గుర్తుచేశారు. అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్గుప్త, బ్లాక్ కాంగ్రెస్ రిజ్వాన్, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్, నాయకులు సుధీర్గౌడ్, మోహన్దాస్గౌడ్, మాజీ ఎంపీటీసీ మేఘమాల, కిషన్ పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్

ప్రతి గింజ కొనుగోలు చేస్తాం

ప్రతి గింజ కొనుగోలు చేస్తాం