
కల్యాణ వైభోగమే..
సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
శ్రీరామనవమి సందర్భంగా జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయంలో ఆదివారం
శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం కనుల పండువగా సాగింది. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అభిజిత్ లగ్నంలో రామచంద్రమూర్తి సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేశారు. అలయ పూజారి మధుసూదనాచార్యులు కల్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల
తలంబ్రాలు సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి, కలెక్టర్ రాహుల్రాజ్ దంపతులు, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ అధ్యక్షుడు బండ నరేందర్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.
– మెదక్ మున్సిపాలిటీ

కల్యాణ వైభోగమే..